- Advertisement -
జీహెచ్ఎంసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి
Allu Arjun's uncle Chandra Shekhar Reddy complained in GHMC Prajavaniహైదరాబాద్
అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి సోమ వారం నాడు హెచ్ఎంసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణ పై పునరాలోచన చేయాలని అయన కోరారు. రోడ్డు విస్తరణలో తన ఇంటి లో ఒకవైపు 20 అడుగులు మరోవైపు 30 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ 1100 కోట్ల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సేకరణ సమస్య కారణంగా ఇక్కడ రోడ్డు పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుంది.
- Advertisement -




