Sunday, September 8, 2024

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (BIEAP) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు.

సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూస్18 తెలుగులో వెబ్‌సైట్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి.. మీ ఫలితాలను పొందవచ్చు. ఆన్ లైన్ మార్క్‌షీట్‌లో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, విద్యార్థి పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి తదితర వివరాలు ఉంటాయి.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 78శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లానే అగ్రస్థానంలో నిలిచింది.రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇక ఒకేషనల్‌ విషయానికొస్తే.. ఫస్టియర్లో 60శాతం, సెకండ్ ఇయర్‌లో 71శాతం ఉత్తీర్ణత నమోదయింది.

ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కాగా.. వారంతా కూడా ఫలితాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి ఈ ఏడాది మొత్తం 10,52,673 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్ పరీక్షలు 5,17,617 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలు 5,35,056 మంది విద్యార్ధులు రాశారు. 52,900 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్