- Advertisement -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
Arrangements for Prime Minister's visit are completeవిశాఖపట్నం
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ను సందర్శించ నున్నారు. ఈ సందర్భంగా విశాఖ పట్నంలో పలు అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొనడంతో పాటు ప్రజ లను ఉద్దేశించి ప్రసంగించనున్నా రు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు.
- Advertisement -




