- Advertisement -
హైదరాబాద్ నవంబర్ 22: బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు రాజీనామా చేయగా.. బుధవారం మరో కీలక నేత అశ్వద్దామరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆర్టీసీ కార్మికుల సంఘం మాజీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో అశ్వత్థామరెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఈటల రాజేందర్తో కలసి ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ వనపర్తి టికెట్ ఇచ్చింది. కానీ ఆయన పోటీ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.
- Advertisement -



