Sunday, September 8, 2024

భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు:

- Advertisement -

భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు:

ఆర్టీసీ ఎం డి సజ్జనార్

హైదరాబాద్:ఏప్రిల్ 01
తెలంగాణలో ఉన్న రాము లోరి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకా రంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తు లు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరిం చారు.

తలంబ్రాల బుకింగ్‌ను ప్రారం భించారు. “నియమనిష్ఠల తో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజల ను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కళ్యా ణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయిం చింది.

ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు.

2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రా లను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోంద న్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.

సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జి క్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్