- Advertisement -
బిజెపికి రాజగోపాల్ రెడ్డి రామ్ !రామ్!
నల్లగొండ, అక్టోబర్ 23 (వాయిస్ టుడే బ్యూరో). మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన చేరన్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో పట్టున్న నాయకులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,బ్రదర్స్కు పేరుంది. మునుగోడు ఉప ఎన్నికల ముందు బిజెపిలో చేరిన కోమటిరెడ్డి ఓటమిపాలు అయిన విషయం పాఠకులకు విధితమే. కాంగ్రెస్ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కలిసి కాంగ్రెసులోకి ఆహ్వానించడంతో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొ నున్నారు. గోపాల్ రెడ్డి రాకతో మునుగోడులో సునాయసంగా కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది.