Sunday, September 8, 2024

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

- Advertisement -

• కేసీఆర్ పాలనలో మారిన కంటోన్మెంట్ రూపురేఖలు
• సాయన్న నాయకత్వంలో ప్రతివార్డులోనూ జోరుగా అభివృద్ధి
• అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని లాస్యనందిత మనవి
• కంటోన్మెంట్ వార్డు 5లో లాస్యనందిత పాదయాత్ర
• లాస్యనందిత పాదయాత్రకు విశేష స్పందన

సీఎం కేసీఆర్ పాలనలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న నాయకత్వంలో ప్రతి వార్డులోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి తనను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని లాస్యనందిత విన్నవించారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం 5 వార్డు పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.  మహాత్మాగాంధీ నగర్ బస్తీ, సంజీవయ్య నగర్, వీకర్ సెక్సన్, సెకండ్ లక్ష్మీనగర్, ఇంద్రపురి రైల్వే కాలనీలో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా లాస్యనందితకు ఘనస్వాగతం లభించింది.  జనం అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం పలికారు. బొట్టు పెట్టి మరీ ఆశీర్వందించారు. ప్రచారంలో ఎటు చూసినా గులాబీజెండాలే కనిపించాయి. గులాబీశ్రేణులు డప్పు దరువులతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ కు జై అంటూ నినాదాలతో సందడి చేశారు. గుర్తుల గుర్తుంచుకో కారును గుర్తుంచుకో అంటూ నినదించారు.
ఈ సందర్భంగా లాస్యనందిత మాట్లాడుతూ సమైక్యపాలనలో అభివృద్ధికి నోచుకోని కంటోన్మెంట్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక ద్రుష్టితో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందన్నారు. మిగిలిన చిన్న చిన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఫెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు గులాబీపార్టీ సిద్ధంగా ఉందన్నారు. తనను భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తే కంటోన్మెంట్ ను రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని లాస్యనందిత స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత ప్రత్యేకంగా మాట్లాడారు. అవ్వ, తాత అంటూ వ్రుద్ధులతో మమేకమయ్యారు. నెలనెలా పెన్షన్ అందుతుందా అంటూ ఆరా తీశారు. లాస్యనందితకు బదులిస్తూ వ్రుద్ధులు, యువత అంతా బీఆర్ఎస్ కు జై కొట్టారు. లాస్యనందితకు వెన్నంటి ఉంటామని ప్రతినబూనారు. జయహో కేసీఆర్ అని నినదించారు. లాస్యనందిత విజయం ఖాయమని వ్రుద్ధులు స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలంతా లాస్యనందిత వెన్నంటి ఉంటామని మాట ఇచ్చారు.
ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, సీనియర్ నాయకులు పెద్దల నర్సింహ్మ యాదవ్, పార్టీ నేతలు గిరి, రావు, రాజు, రిచర్డ్ రాజు, బాలమ్మ, పద్మ, మాస్టర్ తో పాటు యువ నాయకులు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్