గజ్వేల్: గజ్వెల్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి,, కర్ణాటక ఏఐసీసీ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా ఇంఛార్జిలావణ్య బల్లాల మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములగట్ గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో చదువుకోవడానికి 4 గ్రామాల పిల్లలు వచ్చేవారట ఇప్పుడు ఆ గ్రామానికి స్కూల్ లేదు. ఆర్ అండ్ఆర్ కాలనీలలో ఉన్న కుంటాలో చాలామంది పడి చనిపోతున్నారు పట్టించుకునే నాధుడే లేడు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అందరికి డబులు బెడ్ రూమ్స్ వస్తాయని అన్నారు. బీఆర్ ఎస్ -బీజేపీ రెండు ఒకటే. ఇక్కడ పోటీచేస్తున్న ఈటెల కూడా బీఆర్ఎస్ నుండి వచ్చిన వాడే.

కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని ఈటెల- కేసీఆర్ ఒకటి అయ్యారు. మీరు ఈటెల కు ఓటు వేస్తే హుజురాబాద్ వెల్లుతాడు. కేసీఆర్ కామారెడ్డి కి పోతాడని అన్నారు. నేను లోకల్ అభ్యర్థిని. నాకు ఓటు వేసి గెలింపించండి ను గుండెల్లో పెట్టుకుని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. లావణ్య బల్లాల మాట్లాడుతూ 200బెడ్ రూమ్ లేవు కానీ 200 ఎకరాల పంహౌస్ ఉంది కేసీఆర్ కి. రాష్ట్రంలో ధనవంతులకు పని ఉంది కాని పేదవాడికి పని డొరకదు. అడ్డాల మీద కూలీలుగా మారారు. పేపర్ లీక్ చేస్తాడు ఉద్యోగాలు అమ్ముకుంటాడు కెసిఆర్. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. పారిశ్రామిక రంగాన్ని గజ్వెల్ కి తీసుకిచ్చాడా. కర్ణాటక రాష్ట్రంలో ఎలాగైతే పథకాలు అమలు అవుతున్నాయో తెలంగాణ రాష్టంలో కాంగ్రస్ వస్తే అవే పథకాలు అమలు చేస్తామని అన్నారు.



