Friday, October 18, 2024

నేరం జరగలేదని చెప్పగలరా

- Advertisement -

విజయవాడ, అక్టోబరు 11: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన  జగన్ కక్ష సాధింపుతో చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.  నేరం జరగలేదని మాత్రం వారు ఎక్కడా చెప్పడం లేదని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును పూర్తి ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. అలాంటప్పుడు కక్ష సాధింపు చర్య ఎక్కడ? అని ప్రశ్నించారు. వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారన్నారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారన్నారు. సీమెన్స్ కూడా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమకు సంబంధం లేదని తెలిపింది. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులను పక్కదారి పట్టించారన్నారు.ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారన్నారు. ఈ కుంభకోణంలో పాత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే అన్నారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రూ.300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని టీడీపీ అధినేత దుర్వినియోగం చేశారన్నారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారన్నారు. స్కిల్ కేసును విచారణ చేయాలని భావించిన సీఐడీ ఆ దిశగా విచారించిందన్నారు. కోర్టు కూడా చంద్రబాబు తప్పు చేశారని భావించి జ్యూడిషియల్ రిమాండ్ విధించిందన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు లాయర్లు నెల రోజులుగా క్వాష్ మీదనే మాట్లాడుతున్నారన్నారు.

ఆయనకు తెలిసిన ఏకైక విద్య విచారణకు రాకుండా కప్పేయడమే అన్నారు. ప్రతి కేసులో ఏదో టెక్నికల్ కారణంతో కేసును నిలిపివేస్తున్నారన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు మాజీ సీఎం అని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగారని, అలాంటి వ్యక్తి ఎందులోనూ దొరకలేదని, కానీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అడ్డంగా దొరికారని వ్యాఖ్యానించారు. కోర్టుకూడా నమ్మే చంద్రబాబును జైలుకు పంపించింది. వాళ్ల లాయర్లు కూడా ఒకే పాయింట్‌ మీద వాదిస్తున్నారని విమర్శించారు. లేని ప్రాజెక్టులు ఉన్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు. పెండ్యాల శ్రీనివాస్‌, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయారు. ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకొచ్చారు. పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్‌గా కాకుండా, ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడో అర్థం కావడం లేదు. అమరావతి అంతా కుట్రనే. అన్ని వ్యవస్థలను మోసం చేశారు. తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలు మోహం చాటేస్తున్నారు. సొంతపార్టీ నేతలే టీడీపీని పట్టించుకోవడం లేదు. జాకీలు పెట్టి లేపిన టీడీపీ పార్టీ లేవదు. ’ అని సజ్జల పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్