Sunday, September 8, 2024

కాంగ్రెస్, బీజేపీ మధ్య బొగ్గు గనుల పంచాయితీ

- Advertisement -

హైదరాబాద్, జూన్ 22 
సింగరేణికి బొగ్గు గనులు (Coal Mines) కేటాయించకుండా వేలం వేలం వేసిన అంశంపై రాజకీయం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగేరేణికి ఉన్న గనులు త్వరలో అియపోతాయని ఆ తర్వాత గనులు లేకపోతే సంస్థ మనుగడ ఉండదని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనుల్ని కూడా వేలం వేస్తోంది.ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ లో నిర్వహించారు.  బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు  కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని ప్రస్తావించారు.బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. గత ప్రభుత్వ పాలనలో కొయ్యగూడెం, సత్తుపల్లిలోని 6 కోల్ బ్లాకులను సింగరేణికి కేటాయిస్తే అనువుగా ఉంటుందని అన్నారు. ఈ విషయమై కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని భట్టి కోరారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడేందుకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక బొగ్గు గనుల వేలంలో సింగరేణికి రిజర్వేషన్ కల్పించాలని భట్టి కోరారు.  ఈ అంశంపై  కిషన్ రెడ్డికి భట్టి వినతి పత్రం కూడా సమర్పించారు.బొగ్గు గనుల  వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి అన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు తెలిపారు.   ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని వివరణ ఇచ్చారు. సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ను వేలం వేస్తున్నారు.  శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. మొత్తం దక్షిణ భారతదేశానికే సింగరేణి బొగ్గు సరఫరా అవుతున్నది. థర్మల్ ప్లాంట్లతో కరెంటు ఉత్పత్తి అవుతున్నది. కల్యాణ ఖని, సత్తుపల్లి, కొయ్యలగూడెం, శ్రావణ్‌పల్లి బ్లాకుల్లో బొగ్గు వెలికితీత సర్వేకు సింగరేణి రూ.70 కోట్లు ఖర్చు చేసింది. బొగ్గు రవాణా కోసం రూ.750 కోట్లతో సత్తుపల్లి-కొయ్యలగూడెం రైల్వే లైన్ వేయించింది. మొత్తం 45 మైన్‌ల ద్వారా ఏటా 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇకపై అదనంగా మరో 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు ఉన్నాయి. థర్మల్ ప్లాంట్‌నూ సింగరేణి రన్ చేస్తున్నది. ప్రైవేటు సంస్థలకు వేలం రూపంలో కట్టబెట్టే బదులు సింగరేణికే ఇవ్వండితెలంగాణకు సింగరేణి జీవనాడి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు మాత్రమే. ఏడేండ్ల తర్వాత (2021 మార్చి) అది 13,688 మెగావాట్లకు పెరిగింది. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సప్లై తప్పనిసరి. సింగరేణిలోని బొగ్గు నిక్షేపాలను, వెలికితీతను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు తీసుకున్నది. మైనింగ్ లైసెన్సులూ ఇచ్చింది. ఇది కేంద్రానికి సైతం తెలుసు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్లాకుల్ని వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి‘సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు. హైదరాబాద్‌లో కూర్చున్న కొందరు (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ..) అసత్య ప్రచారం చేస్తున్నారు. కార్మికులు వారి మాటలు నమ్మొద్దు. సింగరేణిలో తెలంగాణ వాటా 51% ఉన్నది. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. సింగరేణిని కేంద్రం కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఇంతకాలం అబద్ధాలు చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు నేను ఇస్తున్న క్లారిటీతో ఈ రాత్రికి నిద్రపోరు. తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలని కేంద్రం కోరుకుంటున్నది.’‘సింగరేణిలో తెలంగాణ వాటా 51%. కేంద్రానికి 49%. నిర్ణయాధికారమంతా రాష్ట్రానిదే. మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించేది తెలంగాణే. సింగరేణిపై కేంద్రానికి ఎలాంటి అధికారమూ లేదు. ప్రైవేటీకరించాలంటే తెలంగాణ అంగీకారం తప్పనిసరి. ప్రైవేటైజ్ చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదు. ఆ అంశమే ఉత్పన్నం కాదు. వేలం ద్వారానే గనులను వేలం వేయాలని, నామినేటెడ్ పద్ధతిలో వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా తొమ్మిది రౌండ్లలో 300 గనులను వేలం వేశాం. దీని ద్వారా ఒడిశా ప్రభుత్వానికి రూ.36 వేల కోట్లు రెవెన్యూ సమకూరుతున్నది. బొగ్గు గనుల్ని, బ్లాకుల్ని వేలం వేస్తే రాష్ట్రాలకే ఆదాయం పెరుగుతుంది. (జూన్ 19, 2024-06-20న ఢిల్లీలోని బొగ్గు మంత్రిత్వశాఖ కార్యాలయంలో మంత్రి కిషన్‌రెడ్డి.)అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వేలంలో పాల్గొనలేదు. పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని అప్పటి ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.మొత్తంగా సింగరేణి  బొగ్గు గనుల రాజకీయం.. తెలంగాణలో ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Read More..

Follow Us On: Youtube

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్