Thursday, January 16, 2025

మృతుల కుటుంబాలకు   నష్టపరిహారం

- Advertisement -

మృతుల కుటుంబాలకు   నష్టపరిహారం

Compensation to the families of the deceased

రూ.25 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

సంఘటన పై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం:
మంత్రుల బృందం

తిరుపతి,
వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన  తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు గౌ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.

గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి  నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియా తో మంత్రులు మాట్లాడుతూ  ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సి సి కెమెరా లు ఉన్నాయని వాటిని పరిశీలించి
ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మృతిచెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.

తిరుపతి లో జరిగిన సంఘటన తెలిసినన  వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతి కి  పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్