Sunday, September 8, 2024

ఎంపీ ఆఫీసులో జనజాతర బండి సంజయ్ కు అభినందనల వెల్లువ..

- Advertisement -

ఎంపీ ఆఫీసులో జనజాతర

బండి సంజయ్ కు అభినందనల వెల్లువ..

కరీంనగర్
కరీంనగర్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ను కలిసి అభినందించేందుకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. కరీంనగర్

పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎంపీ కార్యాలయం సందడిగా మారింది. ఉదయం నుండే జన జాతర మొదలైంది. పొద్దున్నే సంజయ్ నివాసం

వద్దకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుండి ఎంపీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ ను మధ్యాహ్నం వరకు విరామం లేకుండా ప్రజలు, నాయకులు కలిసి శాలువా కప్పి, పూల బొకేలు అందించి

అభినందనలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి సైతం రాష్ట్ర నాయకులు తరలి వచ్చి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా

రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషా, జనగాం జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి తోపాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం, యాదవ, గౌడ, మున్నూరుకాపు, దళిత, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున

తరలివచ్చి సంజయ్ ను కలిసి అభినందనలు తెలిపారు. సంజయ్ తో కలిసి ఫోటోలు దిగారు. జనం తాకిడితో ఎంపీ కార్యాలయం జాతరను తలపించింది. ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంపీ

కార్యాలయంలోనే ఉన్న బండి సంజయ్ సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్