Thursday, April 24, 2025

గిరిజన తండాల కోసం కంటైనర్ ఆస్పత్రి

- Advertisement -

గిరిజన తండాల కోసం కంటైనర్ ఆస్పత్రి

Container hospitals for tribals

విశాఖపట్టణం, నవంబర్ 25, (వాయిస్ టుడే)
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కంటెయినర్ ఆసుపత్రిని ఆందుబాటులోకి తెచ్చారు. మొదట పైలట్‌ ప్రాజెక్ట్‌గా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి కరడవలసలో.. 3 గదుల కంటెయినర్‌ ఆసుపత్రిని సిద్ధం చేశారు.కొండపైనున్న కరడవలస గ్రామానికి సరైన దారి లేదు. దీంతో మైదాన ప్రాంతంలో తయారుచేసిన కంటెయినర్‌ను అక్కడికి తరలించేందుకు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. ఈ కంటెయినర్‌లో వైద్యుడి గది, రోగులకు నాలుగు పడకలతో మరో గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. దీంట్లో 15 రకాల వైద్యపరీక్షలు చేయనున్నారు. ఇది 10 గ్రామాల గిరిజనులకు సేవలు అందిచనుంది.దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ‘పార్వతీపురం జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో.. కూటమి ప్రభుత్వం గిరి వైద్య కేంద్రాల పేరిట కంటెయినర్ ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది’ అని టీడీపీ స్పష్టం చేసింది.’అనార్యోగానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డోలి మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో, తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్‌ ఆస్పత్రిని నెలకొల్పారు. కంటైనర్‌ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు’ అని టీడీపీ వెల్లడించింది.ఈ కంటెయినర్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన తర్వాత.. మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేని గ్రామాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మన్యంలో మరికొన్ని ప్రాంతాల్లో కంటెయినర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరికొన్ని అందుబాటులోకి వస్తే.. గిరిబిడ్డలకు కష్టాలు తప్పనున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్