- Advertisement -
శ్రీశైల మల్లన్న హుండీల లెక్కింపు
Counting of hundis of Srisaila Mallanna
శ్రీశైలం
శుక్రవారం రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,59,68,400/-నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో (09.01.2025, 30.01.2025 ) సమర్పించడం జరిగింది.ఈ నగదుతో పాటు 64 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 3కేజీల 170 గ్రాముల వెండి లభించాయి.అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు- 590, చైనా యువాన్స్- 100, సౌదీ అరేబియా రియాల్స్ – 5, కువైట్ దినార్సు – 2, కెనడా డాలర్లు- 10, యూఏఈ దిర్హమ్సు – 1090, సింగపూర్ డాలర్లు -14, ఖత్తారు రియాల్స్ – 1, యూరోస్ – 5, మలేషియా రింగిట్స్ – 23, యూకే ఫౌండ్స్ 45, ఆస్ట్రేలియా డాలర్లు – 240, రష్యా రూబెల్స్ -30 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -