ప్రజలందరూ విజయం సాధించాలి – సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.
ఆయుధ పూజలో పాల్గొన్న సైబరాబాద్ సీపీ.

సైబరాబాద్ అక్టోబర్ 23 వాయిస్ టుడే ప్రతినిధి:
విజయదశమి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాష్ మహంతి, ఐపీఎస్ లతో కలిసి పాల్గొన్నారు.
హెడ్ క్వార్టర్స్లోని బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ స్టోర్, మాగజైన్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ రూమ్, ఎంటీ సెక్షన్ , హెడ్ క్వార్టర్స్ రూమ్లలో ఆయుధాలు, వాహనాలు తదితర విభాగాల్లో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగాసంతోశంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు. విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్. సైబరాబాద్ అడిషనల్ సీపీ అడ్మిన్ అవినాష్ మహంతి, ఐపీఎస్., ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీ సందీప్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, సీస్డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్ రావు, ఏడీసీపీ శంకర్ నాయక్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ ఇంద్రవర్ధన్, ఏసీపీ సీస్డబ్ల్యూ నాగ వెంకట సాయి, ఏసీపీ కృష్ణ, జే ఏఓ అకౌంట్స్ సాయి కుమార్, ఎం డి ఓ I ప్రశాంత్ బాబు, ఎం టి ఓ II వీరలింగం, రిజర్వ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్ పోర్ట్ టీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



