Sunday, September 8, 2024

దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి

- Advertisement -

దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి

మంత్రుల వ్యాఖ్యలు అర్ధరహితం

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్

జగిత్యాల,
వందల ఏళ్లనాటి హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగే బృహత్తరమైన కార్యక్రమానికి హాజరు కావలసిందిగా అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ లను ఆహ్వానిస్తే తమది సెక్యులర్ పార్టీ అని మేము హాజరు కాబోమని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ డిమాండ్ చేశారు.
గురువారం ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి నిజమైన హిందువులు ఎవరు అయోధ్యకు వెళ్ళరని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అవి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కావని రేషన్ బియ్యమని, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ అయోధ్యలో గుడి కట్టేకంటే సౌచాలయం కడితే బాగుండని చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బ తీశాయన్నారు. నిన్న దేవాదాయ ధర్మాదాయ, శాఖ మంత్రి కొండ సురేఖ మరో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ లు కలిసి ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వేద పారాయణ సభలో ఎందుకు పాల్గొన్నారని లౌకివాదులం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి హిందువుల గుళ్ళల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే అర్హత మంత్రులకు లేదన్నారు. తమది లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు విరాళాల రూపంలో ఇచ్చిన హిందువులకు చెందిన దేవాలయాల సొమ్మును దోచుకుంటుందని అలాగే లౌకిక పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మసీదులపై,చర్చిలపై ప్రభుత్వ యాజమాయిషీ  ఎందుకు లేదని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడాలే తప్ప హిందూ ధర్మాన్ని హిందువులను విమర్శించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని మర్రిపెల్లి
సత్యం హితవు పలికారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్