Friday, October 18, 2024

సర్పంచుల పదవీకాలం పొడిగిస్తారో ఎన్నికలు నిర్వహిస్తారో తేల్చుకోండి

- Advertisement -

సర్పంచుల పదవీకాలం పొడిగిస్తారో ఎన్నికలు నిర్వహిస్తారో తేల్చుకోండి

రైతులకు ఇబ్బందులు కలిగేలా చేస్తే సహించేది లేదు

సర్పంచ్లకు ఘన సన్మానం

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఈనెల 31న ముగియనుండడంతో పదవి కాలం పొడుగిస్తారా లేక ఎన్నికల నిర్వహిస్తారో తేల్చుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలంలో ఏర్పాటుచేసిన మండల ప్రజా పరిషత్తు కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారూ. మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికా వద్దని, ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించే సమయానికి సమస్యలన్నిటిని పిన్ చేసి తన దృష్టికి తీసుకురావాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతులు ఇబ్బంది పడకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు చాలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రైతులకు ఏదైనా ఇబ్బందులు తలెత్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సర్పంచుల పదవీకాలం ముగియకముందే గ్రామ కార్యాలయాలను ప్రారంభించాలని, ఇన్చార్జి మంత్రి నిర్ణయం తీసుకొని వెంటనే వాటి ప్రారంభోత్సవానికి అంగీకరిస్తే బాగుంటుందని అన్నారు. ఈనెల 31న సర్పంచుల పదవీకాలం ముగుస్తుందని గ్రామపంచాయతీలో భవనాలు ప్రారంభోత్సవానికి మంత్రి సహకరిస్తే సర్పంచుల కల కూడా నెరవేరుతుందని అన్నారు. 200 యూనిట్లలోపు కరెంటు వాడుకుంటున్న ఎవరైనా సరే బిల్లు కట్టకుండా ఉండాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు మంత్రి కూడా బిల్లు కట్టవద్దని చెప్పిన వీడియో కూడా ఉందని ఎవరైనా విద్యుత్ విభాగం అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఆ వీడియో చూపించాలని అన్నారు. వినకపోతే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. విద్యుత్ బిల్లుల విషయంలో కూడా అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో  ఎంపీపీ రాణి, శ్రీకాంత్ జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణరావు, పిఎస్ సిఎస్ చైర్మన్ సంపత్, నాయకులు ఇంద్రసేనారెడ్డి సత్యనారాయణ రావు లతోపాటు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీ లతోపాటు వివిధ విభాగాల్లోని అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్