వాయిస్ టుడే , మహబూబ్ నగర్ జిల్లా: పోలింగ్ కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ స్టార్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పొలిటికల్ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి.. మహబూబ్ నగర్ జిల్లాలో హోరాహోరీగా ప్రచార పోరు జరుగుతున్న 3 నియోజకవర్గాల్లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులు లిక్కర్ నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. రెండు నియోజకవర్గంలో అయితే రాత్రికిరాత్రే పంపకాలు పూర్తైనట్లు తెలుస్తుంది. ఇక, ఆ మూడు నియోజకవర్గాల్లో ఒక చోట ఓటుకు రూ.3 వేలు ఇస్తే, మరోచోట రూ.2 వేల చొప్పున పంచారట. నియోజకవర్గాల్లో డబ్బుల పంపకాలు ప్రారంభమయ్యాయి. ఓ పార్టీ నేత ఓటుకు ఒక లిక్కర్ బాటిల్ రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అటు జడ్చర్ల ,మహబూబ్నగర్ దేవరకద్ర, నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల దాకా డబ్బులు ఇస్తున్నారని సమాచారం.. గ్రామీణ ప్రాంతాల్లో లిక్కర్ డబ్బుల పంపకాలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తున్నప్పటికి.. మరోవైపు డబ్బును లిక్కర్ను ఒకే చోట నిల్వ చేయడం సురక్షితం కాదని ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటున్నారు.. డబ్బు పంపకాల వ్యవహారాన్ని చివరి రోజు రాత్రి వరకూ పెట్టుకుని టెన్షన్ పడడం కంటే ముందుగానే పంచేస్తే మంచిదనే అభిప్రాయంతో చాలామంది పంపకాలు చేస్తున్నారు. అయితే, డబ్బు పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం అవలంభిస్తున్నారు. ఇప్పటికే, బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులకు భారీగానే ఫండింగ్ చేసింది. ఒక విడత నిధులను అభ్యర్థులకు ఇచ్చేసింది. ఇప్పుడు మిగతా నిధుల సర్దుబాటు కార్యక్రమం కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ చక్కబెట్టేస్తున్నట్టు టాక్.
మహబూబ్ నగర్ జిల్లాలో పంపకాలు షురూ..
Published By Voice Today Team
207
- Advertisement -
- Advertisement -
- Tags
- district medical board
- district medical office
- district medical officer
- double bedroom houses distribution in hyderabad
- kurumurthy swamy in mahabubnagar
- mahabubnagar
- mahabubnagar district
- mahabubnagar new districts
- mahabubnagar news
- new districts
- new districts effect on mahabubnagar
- new districts in telangana
- no1 news channel in telugu states
- passport price in india 2021
- sadaram certificates in ap
- sadaram certificates in telangana
- telangana new districts



