Tuesday, April 29, 2025

బీజేపీ బాస్ గా డీకే అరుణ..?

- Advertisement -

బీజేపీ బాస్ గా డీకే అరుణ..?
హైదరాబాద్, ఏప్రిల్ 8, (వాయిస్ టుడే )

DK Aruna as BJP boss..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాం చరందర్ రావు, మురళీధర్ రావు, రఘునంధన్ రావు పేర్లు ఉన్నాయి. కొంతకాలంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తుంది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం డీకే అరుణ పేరును చాలా సీరియస్ గా పరిశీలిస్తుందంట.దేశాన్ని యూనిట్ గా తీసుకుంటే వాటిలో కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షురాళ్లను సైతం పెట్టాలన్నది బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనలో ఉందట. దానికి రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ కూడా తోడు కావడంతో డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష రేసులో ముందున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలతో పాటు పార్టీ శ్రేణులు కూడా వివిధ గ్రూపులుగా విడిపోయారంట. తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని నాయకులు అంటుండగా.. తమ నాయకుడు అయితేనే పార్టీని సమర్దవంతంగా నడపగలడని పార్టీ శ్రేణులు వాదించుకుంటున్నారంట . డీకే అరుణ పేరును తెరపైకి తీసుకుని రావడం ద్వారా ఒక మహిళా నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు ఉంటుందని జాతీయ నాయకత్వం వద్ద చర్చ ఉందట.దీనికి తోడు డీకే అరుణకు ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడంతో ఆమె పేరు బలంగా వినిపిస్తుందంట. డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే మిగతా నేతలు ఎవరూ వ్యతిరేకించరన్న చర్చ సైతం రాష్ట్ర కార్యాలయంలో సాగుతోందంట.డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంలో పార్టీ అంతర్గత అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా ఆమెకు కలిసి వస్తున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అక్కడ నుంచి కాంగ్రెస్ కు చెక్ పెట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలవడం డీకే అరుణకు కలిసి వస్తుందట. కాంగ్రెస్ హోల్డ్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం దగ్గర చేసుకునేందుకు డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచనలను పరిశీలిస్తున్నారట.అనుకుంటే ఫ్లోర్ లీడర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డిని పక్కన పెట్టి బీజేపీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పాయల్ శంకర్ ను నియమించే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది. డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా మహిళలను సైతం ఆకట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు చర్చ సాగుతోంది. మరి జాతీయ నాయకత్వం డీకే అరుణను అధ్యక్షురాలిగా నియమించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్