Sunday, September 8, 2024

దొరల పాలన పోయి,పటేళ్ళ పాలన వచ్చినట్లు కావద్దు

- Advertisement -

ప్రజాస్వామ్య పాలన, సామాజిక న్యాయం అమలు జరగాలి

– కాంగ్రెస్ ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ సూచన.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ – హైదరాబాద్.
మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్

© నియంతృత్వ పాలన స్ధానంలో కాంగ్రెస్ పాలన వచ్చింది.

© అయితే కాంగ్రెస్ పాలన దొరల పాలన పోయి పటెళ్ళ పాలన రావద్దని సూచిస్తున్నాం.

©రేవంత్ రెడ్డి నాయకత్వములో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు.

© BRS పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది.

©నియంతృత్వం,అహంకారం, కుటుంబపాలన నుండి విముక్తి కోసమే BRS ను ప్రజలు ఓడించారు.

©తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు.

©అందుకే కేసీఆర్ ప్రభుతాన్ని ఓడించారు.

©BRS ప్రభుత్వానికి ఉన్న అవలక్షణాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకుండా చూసుకోవాలి

©కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తంలో మొదటి చాప్టర్ లో పేర్కొన్నట్లుగా ప్రజాస్వామిక పరిపాలన అందించాలి. నియంతృత్వ లక్షణాలు రాకుండా చూసుకోవాలి.

©కేసీఆర్ ప్రశ్నించే వారిని శత్రువులుగా చూసి అణచివేయాలని చూసాడు. అందులో భాగంగానే నన్ను, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కోదండరామ్ లను జైలులో పెట్టారు. ఇది నియంతృత్వం,అప్రజాస్వామికం.

© ప్రజలు ఈ నియంతృత్వ చర్యలు సహించలేకపోయారు.

©కనుక రేవంత్ రెడ్డి నేతత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే వారిని శత్రువులుగా చూడకూడదు.

© ప్రజల పక్షాన వస్తున్న ప్రశ్నలను ప్రజాస్వామిక స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి.

© ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం తల్లి తెలంగాణ పుస్తకం 2001 లోనే రాశాను.

© ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం గురించి ఈ రోజు మాట్లాడుతున్న విషయాలు కావు.

©కేసీఆర్ పాలన దొరల పాలన. అందుకు కేసీఆర్ మంత్రివర్గం సాక్ష్యం.

©ఈ దొరల పాలన వద్దనే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

©అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలి.

© అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత మంత్రివర్గంలో సామాజిక న్యాయ స్ఫూర్తి కొరవడింది.

© ప్రస్తుతం నియమించిన మంత్రి వర్గంలో ఏ సామాజిక వర్గానికి రెండు పదవులు ఇవ్వలేదు. కానీ రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురు ఉన్నారు.

© బ్రాహ్మణ, కమ్మ, వెలమ సామాజిక వర్గం నుండి ఒక్కొకరిని తీసుకున్నారు.

® 93% జనాబా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు తగిన న్యాయం జరగలేదు.

©మంత్రి వర్గ నియామకంలో సామాజిక సమతుల్యత లేదు.

©ముస్లిం ప్రజలూ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని సర్వేలు చెప్తున్నాయి.

©అయితే ముస్లింలకు మంత్రి పదవులు ఇవ్వలేదు.

©ఒకవేళ కాంగ్రెస్ నుండి ముస్లింలు గెలువకపోతే MLC చేసైనా మంత్రి పదవులు ఇవ్వాలి..

©ఏడు శాతం లేని అగ్రకులాలకు పెద్ద పీట వేసి 93 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విస్మరించారు.

© అన్ని రంగాల్లో రెడ్డి వెలమలకు పెద్ద పీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీ లను అనగద్రొక్కితే మా నుండి నిరసన వుంటుంది.

© మిగితా మంత్రి పదవులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలి.

©ప్రజాస్వామిక స్పూర్తితో పాలన అందినంత కాలం, సామాజిక న్యాయాన్ని గుర్తించినంత కాలం మా మద్దతు ఉంటుంది.

©కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మా నుండి ప్రశ్నలు విమర్శలు,నిరసనలు ఉద్యమాలు, పోరాటాలు వుంటాయి.

© కానీ ఆ పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. అది రేవంత్ రెడ్డి మీదనే ఆధారపడి ఉంది.

© అలాగే ప్రభుత్వానికి కొన్ని సూచనలు.

© బడ్జెట్ తో సంబందం లేని, ఒక రూపాయి బారం పడని, హామీలను తక్షణమే అమలు చేయాలి..

© అందులో బాగంగా మేనిఫెస్టోలో పేర్కొన్న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలి..

©ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచాలి.

©ఎస్టీ రిజర్వేషన్లు 12%పెంచాలి.

© ఇవీ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవి. వీటికి కేంద్ర ప్రభుత్వంతో సంబందం లేదు.

© ఉదాహరణకు NTR గారు ఎస్సీలకు 14 నుండి 15% , ఎస్టీలకు 4% నుండి 6% పెంచారు.

© కనుక కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వర్గాల రిజర్వేషన్లు పెంచుతూ జీవో తక్షణమే విడుదల చేయాలి.

©అలాగే కామారెడ్డి బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి.

©ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే కుల గణన చేసి బిసి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. దానిని తక్షణమే అమలు చేయాలి.

©ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దు.

©ఆరు నెలల్లో కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచితే వాటి ద్వారా ఉద్యోగ నియామకాల్లో బిసిలకు న్యాయం జరుగుతుంది.

©తెలంగాణలో oc ల జనాబా 7% మాత్రమే. వీరిలో పేదలు 3% ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు.

©అంటే జనాబాను మించి రిజర్వేషన్లు అగ్రకులాలకు ఇస్తున్నప్పుడు జనాబా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్ బాధ్యత.

©అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన ప్రకారం గత ప్రభుత్వ అవసరాల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల నుండి గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి వారికి అప్పగించాలి.

©బడ్జెట్ సంబందించిన విలువైన సూచనలు ఇస్తున్నాం.

©రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఉన్నపుడే రైతు బందు పథకం క్రింద నాలాంటి సంపన్నులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

©కానీ కాంగ్రెస్ కుడా మొన్న రైతు బందు పథకం క్రింద ధనిక, పేద రైతులకు డబ్బులు ఇచ్చారు.

©కనుక రైతు బందు పేద రైతులకు వర్తింపజేయాలి.

©బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా వుండాలి.

©అలాగే మహాలక్ష్మి పథకంలో బాగంగా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అనేది పేద మహిళలకు పరిమితం చేయాలి.

© ప్రభుత్వ పథకాలు పేదలకు ఉపయోగ పడేలా వుండాలి.

© దళిత బందు కుడా పేద దళితులకు అందాలి.

© ప్రభుత్వ పథకాలు నిరుపేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలని, తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ప్రజలకు పథకాలు అందించాలి.

©వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి.

©ఈ నెలలోనే రైతు బందు డబ్బులు విడుదల చేసినట్టుగా వికలాంగుల పెన్షన్ రు .6000 అలాగే వృద్దులు వితంతువుల పెన్షన్లు రు 4000 ఈ నెల నుండే ఇవ్వాలి.

©ఇవ్వకపోతే వారి పక్షాన ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేపడుతుంది.

©సామాజిక న్యాయం, ప్రజాస్వామిక పాలన అందిస్తే మా సహకారం అందిస్తాం. లేకుంటే ప్రజల పక్షాన మా నిరసన వ్యక్తం చేస్తాం.

©సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు పాలక పదవుల్లో, ప్రభుత్వ రంగ నియామకాల్లో పెద్ద పీట వేయాలి.

© అలా జరగని పక్షంలో మా ప్రశ్నలు, నిరసనలు ఉద్యమాలు మా నుండి ఉంటాయి.

ఈ కార్యక్రమంలో MSF జాతీయ అధ్యక్షులు CH సోమశేఖర్ మాదిగ, MMS రాష్ట్ర నాయకులు JP లత మాదిగ, MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, MSF రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, MSP జిల్లా నాయకులు VS రాజు మాదిగ, TV నర్సింహ మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారపు శ్రీనివాస్ మాదిగ, MSF రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ మాదిగ, అరుణ్ మాదిగ, అజిత్ కల్యాణ్, విజయరావు, రవి మాదిగ, శ్రీ కిషన్ మాదిగ, గజ్జల రాజశేఖర్ మాదిగ, రేణుక మాదిగ, సుజాత మాదిగ, MSF జిల్లా అధ్యక్షులు మహేష్ మాదిగ, రఘుమాదిగ, నాయకులు కొద్రుపల్లి శివ మాదిగ, శ్యామ్ సన్ మాదిగ, వెంకటేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్