Sunday, September 8, 2024

డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలో

- Advertisement -

6611 పోస్టులకు నోటిఫికేషన్‌ మంత్రి సబిత

హైదరాబాద్‌:ఆగస్టు 24:  టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.  హైదరాబాద్ లో నేడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మొత్తంగా 6,611పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

కాగా వర్శిటీలలో అధ్యాపకులు పోస్ట్ ల భర్తీ బిల్లు గవర్న్ వద్ద పెండింగ్ లో ఉంద‌ని తెలిపారు.. ఇప్ప‌టికే ఆ బిల్లుపై గ‌వ‌ర్న‌ర్ అడిగిన అనుమానాల‌కు స‌మాధానాలు ఇచ్చామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో విద్యారంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్ల బడ్జెట్ కేటాయించారని మంత్రి గుర్తుచేశారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల విద్యాసంస్థల్లో రాష్ట్రం గర్వించే స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కొనియాడారు. గురుకులాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడం, వాటిని అప్ గ్రేడ్ చేయడంలో విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు.

కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్ గ్రేడ్ చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని వివరించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని, కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు.

దీంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని, ప్రపంచం అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు.

నీళ్లు, నిధులకు సంబంధించి ఉద్యమకాలం నాటి ఆకాంక్షలు ఇప్పటికే నెరవేరాయని, నియామకాలకు సంబంధించిన ఆకాంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ పాలనలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు…..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్