Monday, May 11, 2026

ఫిబ్రవరి 11న  కలెక్టర్లతోఈసీ సమావేశం

- Advertisement -

ఫిబ్రవరి 11న  కలెక్టర్లతోఈసీ సమావేశం

EC meeting with collectors on February 11

హైదరాబాద్, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మెుదలైంది. గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరో 15

రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హింట్ ఇచ్చారు. తాజాగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాలు,

బ్యాలెట్‌బాక్స్‌లు, బూత్‌లు సిద్ధం కాగా.. ఎన్నికల నిర్వహణపై మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కూడా ప్రారంభించింది.ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్‌ ఆఫీసర్లు, పోలింగ్‌ సిబ్బంది నియామకానికి తెలంగాణ

ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. బీసీ ప్రత్యేక కమిషన్‌ త్వరలోనే రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి

ఎన్నికల సంఘానికి ఇవ్వనుంది. ఆ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదలకు సిద్ధమైంది. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణను ప్రారంభించారు. ముందగా.. ప్రతి జిల్లాకు 10 మంది చొప్పున

మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా జిల్లాల్లోని మిగితా సిబ్బందికి శిక్షణ ఇప్పించనున్నారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి కాగా.. రేపటి నుంచి జిల్లాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.సర్పంచ్, వార్డమెంబర్లు,

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్‌ అధికారులు, ఇతర సిబ్బందిని ఎంపిక చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. సిబ్బంది సంఖ్యను

ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఒకటి లేదా రెండు దఫాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో

అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. సమావేశం తర్వాత.. ఎన్నికల షెడ్యూలుపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. మెుత్తంగా ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం

ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్