Sunday, March 16, 2025

ఎన్నికల వేళ.. మోడీ తెలుగు రాష్ట్రాల్లో టూర్

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 23, (వాయిస్ టుడే):  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తమ అగ్రనేతలను ప్రచారంలోకి దించుతున్నాయి. ప్రియాంక, రాహుల్‌గాంధీలతోపాటు సోనియా, ఖర్గే కూడా ప్రచారానికి రానున్నారు. ఇక బీజేపీ తరఫున ఏకంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటిరే మూడుసార్లు వచ్చిన మోదీ, మరో మూడు రోజులు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయనతోపాటు యూపీ సీఎం యోగి, అసోం సీఎం హేమంత్‌ బిశ్వశర్మ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రచారానికి రానున్నారు. అయితే మూడు రోజులు తెలంగాణలో పలు సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్న మోదీ.. పక్కన ఉన్న ఏపీలో మకాం వేయనున్నారు. అక్కడి నుంచి వచ్చి మూడు రోజులు వివిధ సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలప్పుడు ఆ రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేసి పక్కనే ఉన్న ఉత్తరాఖండ్‌లో పోలింగ్‌ రోజు మకాం వేశారు. ఆ రోజు ఆలయంలో ఆయన కార్యక్రమాలు, పోలింగ్‌ తో పాటు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు అదే వ్యూహం తెలంగాణ విషయంలోనూ పాటిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో .. తెలంగాణలో పోలింగ్‌ రోజున.. పక్కన రాష్ట్రం ఏపీలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ తిరుపతిలో మూడు రోజులు ఉండనున్నట్లుగా బీజేపీ వర్గాలకు సమాచారం వచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఈనెల 25న మోదీ తెలంగాణకు రానున్నారు. 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో పలు సభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు. ఈమూడు రోజులు మోదీ తెలంగాణలోనే ఉండబోతున్నారు. ఇక 28న సాయంత్రం తిరుమల వెళ్లనున్నారు. 28, 29, 30 తేదీల్లో తిరుమలలోనే ఉంటారని అధికార వర్గాలకు సమాచారం వచ్చింది. 29వ తేదీన తిరుపతిలో కార్యక్రమాలు, తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పోలింగ్‌ రోజున అంటే 30వ తేదీన ఉదయం తిరుమల నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభమయి.. తిరుపతిలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన వరకూ ఉండే అవకాశం ఉంది. ఓ వైపు తెలంగాణలో పోలింగ్‌ జరుగుతూంటే.. మరో వైపు ప్రధాని మోదీ తిరుపతిలో హడావుడి చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇది పొరుగు రాష్ట్ర ప్రజల్నిప్రభావితం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూపీలో ఎన్నికల సమయంలో ఉత్తరాఖండ్‌ లో ఆయన చేసిన గుళ్ల పరిశీలన.. పూజలపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్