Sunday, September 8, 2024

మందుబాబుల చర్యతో శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండింగ్

- Advertisement -
Emergency landing in Shamshabad due to the action of drug lords
Emergency landing in Shamshabad due to the action of drug lords

తాగిన మైకంలో విమాన ప్రయాణికుల హల్చల్

హైదరాబాద్: తాగిన మైకంలో దోహా నుండి కొచ్చిన్ వెళుతున్న ఇండిగో విమానంలో నలుగురు ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్లైన్స్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన గురువారం నాడు చోటుచేసుకుంది. దోహా నుండి హైదరాబాద్ మీదుగా కొచ్చిన్ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మద్యం సేవించి విమానం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో విసిగిపోయిన ఎయిర్ లైన్స్ సిబ్బంది శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ మేరకు నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది శంషాబాద్ ఆర్ జి ఐ ఏ పోలీసులకు అప్పగించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై న్యూసెన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్