Sunday, September 8, 2024

సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీఐ ఆధ్వర్యంలో మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు, సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లిన పని చేయించుకోవడం తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టడం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని ప్రభుత్వ పనులపై సమాచారాన్ని పొందవచ్చు.ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ప్రతి భారత పౌరుడు సామాజిక బాధ్యతగా అవినీతి అక్రమాలను నిరోధించడానికి పేద ప్రజలకు ఆర్టీఐ ఆవశ్యకత ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి, వరంగల్ జిల్లా కన్వీనర్ నామిండ్ల హరీష్, అక్కెల్లి పవన్ కళ్యాణ్, సిలువేరు సురేష్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్