Sunday, September 8, 2024

ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు

- Advertisement -

https://transfers.dse.telangana.gov.in/Transfers/promotionszip.do

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో విద్యాశాఖ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం టీచర్ల బదిలీపై కసరత్తు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. కోర్టు తుది తీర్పునకు లోబడే టీచర్ల ట్రాన్స్‌ఫర్లు ఉండాలని హైకోర్టు  ఆదేశించిన నేపథ్యంలో.. బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు పంపించింది.బదిలీలు కోరుకునే ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 8, 9 తేదీల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధికారులు డిస్ ప్లే చేస్తారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. 12, 13 తేదీల్లో సీనియారిటీ జాబితాలను ఉన్నతాధికారులు ప్రచురిస్తారు. 14వ తేదీన ఎడిట్ చేసుకునే వీలు ఉంటుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఆన్‌లైన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. సెప్టెంబరు 16వ తేదీన ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు. 17, 18, 19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు ఇస్తారు.సెప్టెంబరు 20, 21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రదర్శన చేస్తారు. 21న వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే.. 22వ తేదీన ఎడిట్  ఆప్షన్ ను వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు చేపడతారు. ఈ నెల 24వ తేదీన స్కూల్ అసిస్టెంట్ ఖాళీల ప్రదర్శన ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు పొందుతారు. 29, 30, 31 ఎస్టీటీ ఖాళీలను డిస్‌ప్లే చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన ఎడిట్ ఆప్షన్లు ఇస్తారు. అక్టోబర్ 3వ తేదీన ఎస్టీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు చేపట్టనున్నారు. అక్టోబర్ 5 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

టీచర్ల బదిలీలు చేయాలి: హైకోర్టు

నిబంధనలు ఏంటంటే..

సెప్టెంబర్ 1వ తేదీ కటాఫ్ తేదీగా లాంగ్ స్టాండింగ్ కు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్లు నిబంధన వర్తించేలా ప్రతిపాదించారు.

5 లేదా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు లేదా ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేర్చనున్నారు.

పదవీ విరమణకు 3 ఏళ్ల లోపు సర్వీసు ఉన్న టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు.

అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు.

కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గతంలో అప్లై చేసుకున్న టీచర్ల దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పౌజ్ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.

సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 50 ఏళ్ల లోపు వయస్సు ఉండి బాలికల పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీ వర్తింప జేస్తూ ప్రతిపాదనలు పంపించింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్