Sunday, September 8, 2024

కూరగాయల మార్కెట్ యార్డును ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి

- Advertisement -

కూరగాయల మార్కెట్ యార్డును ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి
ఆ పార్టీ నాయకులు ఓటిపి అడిగితే ఇవ్వద్దు
బుగ్గన

బేతంచర్ల
బేతంచర్ల పట్టణంలోని కొలుములపల్లె రహదారిలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ యార్డ్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. అదేవిధంగా సంపూర్ణ భు హక్కు పథకం కింద 1523 మందికి గాను 2378.29 ఎకరాల భూమికి సంబంధించిన భూపట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేతంచర్లల్లో నేటిదాకా కూరగాయల మార్కెట్ యార్డ్ లేకపోవడం శోచనీయమని ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి డోన్ నియోజకవర్గం పరిపాలించారు.  కానీ ఏ ఒక్కరు కూడా వీటిని పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ మార్కెట్ ద్వారా ఎంతో మంది రైతులు వారు పండించిన కూరగాయలను ఇక్కడ అమ్ముకోవడానికి వీలుంటుందని అన్నారు. మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనార్టీ వర్గాలకు చెందిన రైతులకు పట్టాలను పంపిణీ చేశామని బేతంచర్ల మండలంలో ఎక్కడ చూసినా 10 లక్షలకు తక్కువ లేకుండా పొలం ధర పలుకుతుందని మేము పంచిన భూమి యొక్క విలువ 230 కోట్లు ఉంటుందని ఆయన సందర్భంగా తెలియజేశారు. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి అని చెప్పుకునే ఆయనకు టికెట్ కన్ఫామ్ కాకపోయినప్పటికీ ప్రచారం తిరుగుతూ ప్రతి ఒక్కరికి సెంటున్నర ఇంటి స్థలం ఇస్తానంటూ మోసం చేస్తున్నారని తెలిపారు. ఇంటింటికి వచ్చి ఇంటి స్థలాలు ఇస్తున్నాము ఓ.టి.పి చెప్పాలని మభ్యపెడుతున్నారని ప్రజలకు  ఓటీపీ నెంబర్ ను చెప్పవద్దని ఆయన జనాలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, వై.సి.పి నాయకులు ఎంపీపీ బుగ్గ నాగభూషణం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల డైరెక్టర్ బాబు రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు మూర్తి జావలి, మురళి, గౌరమానుకొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్