Friday, January 17, 2025

నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ఫోకస్

- Advertisement -

నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ఫోకస్

Focus on National Highways and State Highways

కడప, జనవరి 11, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ఫోకస్ పెట్టింది. కొత్త ప్రాజెక్టులతో పాటుగా గతంలో అనుమతులు వచ్చిన వాటి పనుల్ని వేగవంతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పనుల్ని 2026నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.. ఈ మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో అమరావతి నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ ఉంటుంది. విజయవాడ నుంచి వెళ్లాలంటే గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కడప మీదుగా వెళ్లొచ్చు. అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా బెంగళూరకు వెళ్లొచ్చు.కేంద్రం నేషనల్ హైవేల నిర్మాణంలో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడకు కొత్తగా హైవే కనెక్టివిటీ ఉండాలని భావించింది. అందుకే రెండేళ్ల క్రితం ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు రూ.1930 కోట్ల అంచనాతో గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ హైవేకు సంబంధించి.. విజయవాడ నుంచి బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలం ముప్పవరం వరకు 113 కి.మీ జాతీయ రహదారులతో ఈ గ్రీన్‌ ఫీల్డ్ వేను కనెక్ట్ చేయనున్నారు. అలాగే బెంగళూరు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా కొడికొండ వరకు ఉన్న 73 కి.మీ కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తారు. మొత్తం 529 కిలో మీటర్ల దూరం మార్గంలో ఇప్పటికే రెండు వైపులా ఉన్న రెండు నేషనల్ హైవేల 186 కి.మీ. మినహా మరో 343 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది.బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను 14 భాగాలుగా చేశారు. బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలం ముప్పవరం నుంచి తాళ్లూరు మండలం తూర్పు గంగవరం వరకు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లాలో 10 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 18.5 కిలోమీటర్లు ఈ పనులు జరుగుతున్నాయి. ఈ హైవే పొడవునా ఎక్కడా కట్టడాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ గ్రీన్‌ఫీల్డ్ వేకు సంబంధించి భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా చెల్లించారు. ఈ వే వెంట ఉన్న ప్రతి ఊరికి బ్రిడ్జి ఏర్పాటు చేస్తు్నారు. అలాగే గుండ్లకమ్మ నదిపై బాపట్ల జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు-మణికేశ్వరం మధ్యలో 360 మీటర్ల పొడవున భారీ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ వే నిర్మాణం పూర్తయితే అమరావతి నుంచి బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు సిద్దమైంది.. ఈ మేరకు హైవే ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్