Tuesday, January 14, 2025

ఫార్ములా ఈ కార్ రేస్.. ఏపీలో సోదాలు

- Advertisement -

ఫార్ములా ఈ కార్ రేస్.. ఏపీలో సోదాలు

Formula E Car Race.. Searches in AP

అమరావతి జనవారి 7
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు. ఫార్ములా-ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్‌తోనూ లింక్ ఉందని అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు ఇవాళ(మంగళవారం) ఏపీకి వెళ్లి సోదాలు నిర్వహించారు. పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాంక్యుమెట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలో ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు ప్రింటర్లు తీసుకువెళ్లారు. పలు డాక్యుమెంట్లను ఏసీబీ బృందం కాపీలు తీసుకుంటున్నారు.మొత్తం 12 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కార్ రేస్‌కు సంబంధించి నిధులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సిబ్బందిని అడిగి పలు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏసీబీ బృందం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చలమశెట్టి సునీల్‌కు చెందిన గ్రీన్కో అనుబంధ సంస్థ అని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. చలమశెట్టీ సునీల్ జన్మస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. సునీల్ తల్లి వెంకటలక్ష్మి గతంలో బందర్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ నుంచి ఉదయాన్నే ఏసీబీ బృందం అధికారులు వచ్చారు. పై అధికారుల ఆదేశాల మేరకే తాము సోదాలు చేస్తున్నామని తెలంగాణ ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్