- Advertisement -
లక్ష్మీపురంలో యంగ్ ఇండియా స్కూలుకు శంకుస్థాపన
Foundation Laying of Young India School at Lakshmipuramమధిర
*అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయంలో భాగంగా శుక్రవారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేనసారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహయం రఘురామిరెడ్డి, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు. .
- Advertisement -




