Sunday, September 8, 2024

రేపటి నుండి ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు,బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం

- Advertisement -

హైదరాబాద్‌ : డిసెంబర్ 08: తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పి స్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదొకటి.

అయితే, సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయా ణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానికత గుర్తింపు కార్డు చూపించి ప్రయాణిం చవచ్చు ఆర్టీసీ ఎండీ
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గ దర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

మహాలక్ష్మి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తాం.

మహిళా మంత్రులు, సీఎస్‌, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్య క్రమంలో పాల్గొంటారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రా త్మక నిర్ణయం ఇది.

ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారతకు దోహద పడుతుంది.

కొవిడ్‌ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. పెరుగు తున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలష్యం పెరుగుతోంది.

ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్