నిర్మల్ బ్యూరో (వాయిస్ టుడే) రిపోర్టర్ సతీష్ సెప్టెంబర్ 03: మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ద్వితీయ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్&బి విశ్రాంతి భవన్ ఆవరణలో మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు గుమ్ముల అశోక్ జర్నలిస్ట్ లతో కలిసి పోస్టర్లు విడుదల చేశారు. ఈసందర్భంగా గుమ్ముల అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర అద్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ అధ్యక్షతన మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ద్వితీయ మహాసభ సమావేశాలు ఈనెల ఆరో తేదీన బుధవారం సికింద్రాబాద్ బాద్ లోని మహేబూబా కాలేజ్ హాలులో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరిస్తుందని ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో కనీసం గుర్తింపు కొరకు ఆకృటేషన్ కార్డులు , ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు, జర్నలిస్టుల హక్కుల సాధన కై నిర్మల్ జిల్లా లోని అన్ని మండలాల్లోని మున్నూరుకాపు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అందరు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వర్యులు గంగుల కమలాకర్, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బండి సంజయ్,పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరు అవుతారని అన్నారు.ఈకార్యక్రమంలో మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ద్యావరశెట్టి మధు,జిల్లా కార్యదర్శి పెంట రంజిత్ కుమార్,సంతోష్,టాడిచెట్ల మధుకర్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు