Sunday, September 8, 2024

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

- Advertisement -

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

కోరుట్ల,

మనిషి మనిషిగా బ్రతికే సమాజం కావాలని ఒకరిని హింసించే హక్కు ఇంకొకరికి లేదని మనుషులంతా సమానమే అంటూ సబ్బండ వర్గాల పక్షాన నిలబడి మతముసుగులో కులం ముసుగులో అణచివేతకు పాల్పడుతున్న దుర్మార్గులపై యుద్ధం చేసి సామాన్యులకు అండగా నిలిచిన మహావీరుడు చత్రపతి శివాజీ అంటూ పలువురు వక్తలు కొనియాడారు..
సోమవారం పట్టణంలోని శ్రీ ప్రభాకర్ గ్రంథాలయం  ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..
ఆనంతరం పలువురు వక్తలు
మాట్లాడుతూ
సైన్యంలో 30% మంది మైనార్టీలను అంగరక్షకులు ఉన్నారని వివరించారు, దుర్మార్గమైన వ్యవస్థను రద్దు చేసిన స్త్రీల పక్షాతి చత్రపతి శివాజీ అని కొనియాడారు.. బ్రాహ్మణియ శక్తులు దేశములవాసి చత్రపతి శివాజీకి రాజము ఏలే అర్హత లేదన్నారు. కరువు కాటకాలు సంభవించినప్పుడు పనులను రద్దు చేసిన గొప్ప మానతవాది శివాజీ అని అన్నారు, శివాజీ శూద్రుని కారణంగా రాజ్య పట్టాభిషేకానికి నిరాకరించిన మరాఠీ బ్రాహ్మణ పురోహితులు కాశి నుండి వచ్చిన గగాబట్ పండితుడు తన కాలి బొటనవేలుతో శివాజీ తిలకం దిద్ది న అవమన పరిచిన చరిత్ర మర్చిపోదు, రైతులకు వ్యవసాయ పనిముట్లు రుణాలను అందజేసి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాలలో రుణాలు కట్టెల సంస్కరణలు చేసి రైతులకు భరోసా నిచ్చిన తిరుపతి శివాజీ, శివాజీకి ఖడ్గాన్ని భవాని మాత ఇచ్చిందని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం. అది పోర్చుగీస్ వారిది దానిపై పోర్చుగీస్ లిపిఉంది.
శివాజీ నేటి యువతకి ఆదర్శమని అతని సేవలు కొనియడారు.ఈ సమావేశంలో చెన్న విశ్వనాథం, రాస భూమయ్య ,సుతారి రాములు, రామకృష్ణ ,శ్రీహరి ,పేట భాస్కర్ పసుల కృష్ణ, భూపెల్లి నాగేష్, ప్రేమ్ సాగర్ ,రాంబాబు, సమీర్, వంశీకృష్ణ ,రమేష్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్