- Advertisement -
తిరుపతి జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న హోంమంత్రి అనిత
Home Minister Anitha will visit family of child who was raped in Tirupati districtతిరుపతి,
ఆదివారం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో పర్యటించనున్న హోంమంత్రి*
బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ ను స్వయంగా అందజేయనున్న హోంమంత్రి
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఆదివారం పరామర్శించనున్నారు . అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాన్ని కలిసి స్వయంగా ఆమె భరోసా అందించనున్నారు . మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ ను అందజేయనున్నారు.
- Advertisement -




