Sunday, September 8, 2024

హిందువుల ఆస్తులు ముస్లిం లకు ఎలా పంచుతారు మల్లిఖార్జున ఖర్గే

- Advertisement -

కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపెడుతుంది
హిందువుల ఆస్తులు ముస్లిం లకు ఎలా పంచుతారు
మల్లిఖార్జున ఖర్గే
హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాము..ఎన్నికల కోడ్ రాకపోతే మరి కొన్ని అమలు చేసే వాళ్ళము.ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మిగతా పథకాలు అమలు చేస్తాముని ఏఐసిసి ఛీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. వర్షాల తో నష్ట పోయిన రైతులను మేము ఆదుకుంటాము. బీజేపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడడం లేదు.. పది ఏండ్ల లో బీజేపీ చేసిన అభివృద్ధి పనుల మీద ఓటు లు అడగడం లేదు. కేవలం కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు..కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపెడుతుంది. మోడీ కేవలం మంగళ సూత్రాలు,ముస్లిం రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. హిందువుల ఆస్తులు ముస్లిం లకు ఎలా పంచుతారని ప్రశ్నించారు.
అంబానీ అదానీ కోసం బీజేపీ పని చేస్తుంది. మోడీ ప్రధాని స్థాయి లో మాట్లాడడం లేదు.ఇందిరా గాంధీ భూ సంస్కరణలు, బ్యాంకు లు జాతీయం చేసింది..మోడీ పది ఏండ్ల లో చేసిన అభివృద్ధి మీద చర్చ చేయడం లేదు. ఇండియా కూటమి అదికారంలోకి రావడం తోనే కేంద్ర ప్రభుత్వం లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాము.మోడీ పేద ప్రజల కోసం పని చేయడం లేదని అన్నారు.
ఇండియా కూటమిఅధికారం లోకి రావడం తోనే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. ఇండియా కూటమి అధికారంలోకి రావడం తోనే దేశ వ్యాప్తంగా కుల గణన చేపడుతాము. మతాల మధ్య చిచ్చు పెట్టాలని మోడీ చూస్తున్నారు.ఐఎఎస్, ఐపిఎస్,ఐఎఫ్ఎస్ లలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ లు తక్కువగా ఉన్నారు.హైదారాబాద్ ను బీజేపీ నిర్లక్ష్యం చేసింది..హైదారాబాద్, బెంగళూర్, ముంబాయి కు రావాల్సిన పెట్టుబడి దారులకు బెదిరించి గుజరాత్ కు తరలించుకు వెళ్ళారు.పువ్వులు పొద్దున పూస్తాయి సాయంత్రం వాడిపోతాయి..చెయ్యి ఎప్పుడు మీతోనే ఉంటుందని అన్నారు.
మోడీ అబద్ధాలు చెపుతున్నాడు. అంబానీ అదానీ లకు పబ్లిక్ సెక్టార్ లను పంచి పెట్టాడు.రేవన్న పై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ రిపోర్ట్ వచ్చిన తరువాత అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బీజేపీ వాళ్ళు నిరాశ తో మాట్లాడుతున్నారు..ఇక్కడి ప్రభుత్వం 5 ఏండ్లు ఉంటుంది. మోడీ ,మొఘలులు ,ముస్లిం మటన్ మంగళ సూత్రాలు గురించి మాట్లాడతాడు. అభివృద్ధి గురించి మాట్లాడడు. టెంపోలో డబ్బులు వస్తుంటే సీబీఐ ఏమి చేస్తుంది. 2021 కుల గణన ఎందుకు చేయలేదు. ఖర్గే అల్లుడి పై వచ్చిన 500 కోట్ల ఆరోపణల పై స్పందిస్తూ విచారణ చేసుకుని దోషి గా తెలితే శిక్ష వేయండని అన్నారు.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్