మిస్ ఇండియా పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్:
Hyderabad is gearing up for the Miss India competition:
హైదరాబాద్
హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్-2025 పోటీల కు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి.
ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన అందమైన మహిళలు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ మే 6,7 తేదీల్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు.
మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవాతో పాటు మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
పోటీలు ప్రారంభం కావడానికి కేవలం 8 రోజులే సమయం ఉండటంతో, ఏర్పాట్లు వేగంగా జరుగు తున్నాయి. నగరంలో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ను విజయవం తంగా నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ప్రపంచంలోని అందమైన మహిళలందరూ ఒకే వేదికపై సందడి చేయనున్న ఈ పోటీలు హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపును తీసుక రానున్నాయి. ఈ అద్భుతమైన వేడుక కోసం నగర ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.