ఆకట్టుకున్న యుద్ధ నౌకల పరేడ్

- Advertisement -

ఆకట్టుకున్న యుద్ధ నౌకల పరేడ్
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
విశాఖపట్టణం, ఫిబ్రవరి 18

Impressive parade of warships

Impressive parade of warships
Impressive parade of warships

విశాఖపట్నం సముద్ర తీరం భారత నౌకాదళ పరాక్రమానికి వేదికైంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే నేవీ తన సన్నద్ధతను ప్రపంచానికి చాటిచెప్పేలా ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ (IFR)ను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ చారిత్రక ఘట్టంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు.సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలి హోదాలో ద్రౌపదీ ముర్ము నౌకాదళ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పర్యవేక్షణలో భాగంగా ఆమె INS సుమేధ నౌకపై ప్రయాణిస్తూ సముద్రంలో ఆరు వరుసల్లో కొలువుదీరిన యుద్ధ నౌకలను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని నౌకాదళ శక్తిని వీక్షించారు. ఈ భారీ ప్రదర్శనలో మొత్తం 71 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.ఇందులో భారత నౌకాదళానికి చెందిన 45 శక్తివంతమైన నౌకలతో పాటు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన 19 విదేశీ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవే కాకుండా కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ మరియు పరిశోధన రంగాలకు చెందిన మరో 7 నౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి.
ఈ ఫ్లీట్ రివ్యూ కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రత, స్నేహపూర్వక దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే ఒక వేదికగా మారుతుంది. నౌకలతో పాటు నౌకాదళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో చేసిన సాహసోపేత విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular