Sunday, September 8, 2024

 ప్రజా పాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారు

- Advertisement -

 ప్రజా పాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారు
కౌశిక హరి. తోట వేణు.విలేకరుల సమావేశం
గోదావరిఖని

In the name of public governance, MLA is running a tyrannical regime

రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారని బిఆర్ఎస్.నాయకులు, కార్మికనేత కౌశిక హరి, భాదితుల నాయకుడు తోట వేణు.ధ్వజమెత్తారు.గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం రోడ్డు వెడల్పులో క్వాటర్లను కోల్పోతున్న బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే చేపడుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధిపై ప్లానింగ్ మ్యాప్ ఉందా.. అసలు ఎప్పుడైనా అభివృద్ధిపై సమావేశం కానీ, చర్చకాని జరిగిందా అని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు పేరుతో కార్మికుల క్వాటర్లను కూల్చిన తర్వాత అభివృద్ధి పనులకు ఎంత నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధికి కార్పొరేషన్ నిధులు వెచ్చిస్తుందా..సింగరేనా.. ప్రభుత్వమా సమాచారం ప్రజలకు, ఇక్కడి నాయకులకు తెలియాల్సి ఉందన్నారు. అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు అందుకు సంబంధించిన భాదితులతో  మాట్లాడి వారిని ఒప్పించాల్సిన భాధ్యత కూడా ఇక్కడి ఎమ్మెల్యే పై ఉందని, వారు కూడా తమ నియోజకవర్గ ప్రజలే అని మరిచార అంటూ ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం కూడా క్వాటర్ల కార్మికులకు సరైన క్వాటర్లను కేటాయించకుండా అర్ధాంతరంగా ఖాళీ చేయమంటూ ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం 82 క్వాటర్ల  భాదితులు వారికి నచ్చిన క్వార్టర్ అలాట్ చేసి వారు అందులోకి షిఫ్ట్ అయ్యేవరకు కరెంట్ కట్, వాటర్ కట్ చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్లానింగ్, సమావేశం, చర్చ లేకుండా జరుగుతున్న కూల్చివేత కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం వత్తాసుపలుకడం సరైన విధానం కాదని అన్నారు. అభివృద్ది చేయాలని అనుకుంటే ఎమ్మెల్యేగా ముందుగా బాధితులను ఒప్పించి, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల తిరస్కరణకు గురికావద్దని హితవుపలికారు. ఎమ్మెల్యే అనాలోచిత విధానాల కారణంగానే గత కొన్ని నెలలుగా పారిశ్రామిక ప్రాంతంలో అలజడి మొదలైందని అన్నారు. విలేకరుల సమావేశంలో బాధితులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్