ఏపీకి పరిశ్రమల క్యూ…
తిరుపతి, జూలై 13
Industry queue for AP…
పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే సుస్థిరమైన ప్రభుత్వం రావాలి. ఆ రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక విధానాలు సైతం ముఖ్య భూమిక వహిస్తాయి. ఆ తరువాతే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వాటిని ఆకర్షించగలవు. తెలుగు రాష్ట్రాలను ఒకసారి పరిశీలిస్తే.. పారిశ్రామికవేత్తలను ఆకర్షించే లక్షణాలు కేసీఆర్ హయాంలో కనిపించాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయి. హైదరాబాదులో ఐటీ రంగానికి చంద్రబాబు బలమైన పునాదులు వేయగలిగారు. కానీ ఆయనను ద్వేషించిన కేసీఆర్ సైతం ఐటి రంగాన్ని వద్దనుకోలేదు. మరింత ముందుకు తీసుకు వెళ్లడం వల్లే తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు వచ్చి పడ్డాయి. అయితే గత ఐదు సంవత్సరాలుగా వైసిపి పరిశ్రమలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. దీంతో జీరో ప్రయత్నం నుంచి చంద్రబాబు ప్రారంభించాల్సి వచ్చింది. అందుకే ఆయన గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు.ఒక ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవిస్తేనే ఆ రాష్ట్రానికి విశ్వసనీయత ఉంటుంది. కానీ ఈ విషయంలో ఏపీ నష్టపోయింది. చంద్రబాబుకు పేరు వస్తుందన్న కోణంలోనే అమరావతిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేవలం రాజధానే కాకుండా.. నాడు చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించారు జగన్. అందుకే పెట్టుబడిదారుల విశ్వసనీయతను కోల్పోయింది ఈ రాష్ట్రం. జగన్ ప్రభుత్వం కూడా పరిశ్రమలు, పెట్టుబడులపై పెద్దగా ఆసక్తి చూపలేదు అన్న విమర్శ ఉంది. దీనికి తోడు చాలా పరిశ్రమలు ఏపీ నుంచి తరలిపోయాయి. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. ఇప్పుడు అదే ఏపీకి శాపంగా మారింది. చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నా పారిశ్రామికవేత్తలు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ముందుగా వారికి ఆంధ్రప్రదేశ్ పై నమ్మకం ఏర్పడితేనే వారు పెట్టుబడులు పెడతారు. ఆ విశ్వాసాన్ని కల్పించే పనిలో పడ్డారు చంద్రబాబు. పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇస్తున్నారు. రాయితీలు, భూములు కేటాయించేందుకు సిద్ధపడుతున్నారు.పారిశ్రామికవే



