- Advertisement -
విజయవాడ: విజయవాడ నగరంలోని ప్రముఖ ఆంజనేయ జ్యూయలర్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేసారు. శనివారం ఉదయం మూడు బృందాలు గంటలకొద్ది తనిఖీలు నిర్వహించాయి. సాప్ట్ కాపీలు, హార్డ్ కాపీలు తనిఖీలు చేపిన అధికారులు, పలు డాక్యుమెంట్స్ స్వాధినం చేసుకున్నారు. కేంద్ర బలగాల భద్రత నడుమ సోదాలు చేసారు. బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
- Advertisement -



