జగన్ కోటరీ వల్లే పార్టీకి దూరం
Jagan distanced himself from the party because of the coterie.
విజయవాడ, మార్చి 12,
వైసీపీ, జగన్పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని ఆయన కోటరీ చెప్పుడు మాటలు వింటూ తనను దూరం పెట్టారని అన్నారు. గత మూడేళ్లుగా చాలా అవమానాలు ఎదుర్కొన్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సీఐడీ ఎదుట హాజరైన ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలకత వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఏర్పడిందని అన్నారు. ఆ కోటరీ కారణంగానే తాను జగన్కు దూరమయ్యాను అన్నారు. అందుకే మనసు విరిగిపోయి పార్టీకి దూరమైనట్టు పేర్కొన్నారు. తాను పార్టీకి మాత్రమే దూరమయ్యానని.. రాజకీయాలకు కాదని అన్నారు. సెకండ్ కేడర్ లీడర్లు తనకు, జగన్కు మధ్య గ్యాప్ క్రియేట్ చేయడంలో విజయం సాధించారని వారు ఎదిగారని చెప్పుకొచ్చారు. జగన్ వ్యవహారశైలితో విషయంలో తన మనసు విరిగిపోయిందని.. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని విజయసాయిరెట్టి చెప్పుకొచ్చారు. వైసీపీలోకి చేరే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. నాయకుడు అనే వాడు చెప్పుడు మాటల్ని నమ్మకూడదన్నారు. అలా నమ్మడం వల్ల పార్టీ నష్టపోతుంది.. నాయకుడు నష్టపోతారన్నారు. తనను జగన్ పార్టీలో కొనసాగాలని కోరారనన్నారు. అయితే అప్పుడే.. తాను నేరుగా చెప్పానన్నారు. మీ చుట్టూ ఉండేవారి చెప్పుడు మాటలు విని తప్పుడు దారి పట్టవద్దని చెప్పానన్నారు ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్దాలు చెబుతున్నారో తెలుసుకోవాలన్నారు. మీ చుట్టూ ఉన్న వారి ఉన్న మాటలు వినవద్దు అని ఫోన్లో స్పష్టంగా చెప్పానని చెప్పుకొచ్చారు. ఘర్ వాసపసీ అనేది అసాధ్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ తాను ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పానని.. వ్యవసాయం చేసుకుంటున్నానన్నారు.విజయసాయి