Breaking News
Saturday, July 27, 2024
Breaking News

నేడు కారెక్కనున్న కాసాని

- Advertisement -

హైదరాబాద్:నవంబర్ 03: తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేయకూడదని టిడిపి అధినేత పిలుపునిచ్చారు. దీంతో అలిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం గజ్వేల్ లోని ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ కాసానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేయవద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కాసాని టీడీపీ పార్టీకి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముదిరాజ్ సామాజిక వర్గంలో కీలక నేతగా ఎదిగిన కాసానికి బీఆర్ఎస్ గోషామహల్ నుంచి బరిలోకి దించనుందని తెలుస్తోంది.

ఓ వైపు ముదిరాజ్ సామాజిక వర్గం తమకు బీఆర్ఎస్ ఒక్క సీటు కేటాయించలేదని ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో కాసానికి ఎమ్మెల్యే సీటు కేటాయించనున్నట్లు తెలుస్తోంది…

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!