Sunday, September 8, 2024

అభివృద్ధిలో ఎల్బీనగర్ ను అగ్రభాగాన నిలుపుతా : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

- Advertisement -

అభివృద్ధిలో ఎల్బీనగర్ ను అగ్రభాగాన నిలుపుతా

: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఘనంగా సత్కరించిన పార్టీ శ్రేణులు

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురంలోని జి.ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్‌లో కార్యకర్తలు సన్మాన సభను నిర్వహించారు. ఈ సభలో పార్టీ శ్రేణులు, అభిమానులు తీసుకొచ్చిన పుష్పగుచ్చాలు, శాలువాలతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తనను ఓడించడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టి తనను భారీ మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి కమలా సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్