Friday, February 7, 2025

నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ గా కృష్ణకుమారి

- Advertisement -

నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ గా కృష్ణకుమారి

Krishnakumari as Municipal Chair Person of Nandigama

ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ
ఏపీ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ నిర్ణయమే మా అందరి నిర్ణయం. అధిష్టానం,  అందరి ఆమోదంతోనే మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నిక చేసారు. సహకరించిన కౌన్సిలర్ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలని అన్నారు.
‘ డమ్మీ ‘ అంటూ.. కొన్ని కోయిల లు ముందే కుసాయి.. ఈ రోజు ఎవరు డమ్మీ అయ్యారు? ఈ రోజు ఏం సమాధానం చెప్తారు?  నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు. వైసీపీ బోర్డును పక్కకు నెట్టి.. 15 మంది  కౌన్సిలర్ల బలంతో నందిగామ మున్సిపాలిటీ పై కూటమి జెండా ఎగురవేశమని అన్నారు. గతంలో వైసిపి కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి దూరంగా వెళ్లి ఆ తర్వాత మీపై ఏం మాట్లాడారో రాష్ట్రం అంతా చూసింది. కానీ గత రెండు రోజులుగా మా కౌన్సిలర్లు నేను వేసే ప్రతి అడుగులోనూ మద్దతుగా ఉంటూ కలిసి ముందుకు సాగారు. గత ఐదేళ్లు కమిషన్ల కక్కుర్తి తో నందిగామ మున్సిపాలిటీని వైసిపి భ్రష్టు పట్టించింది. రాబోయే కాలంలో కూటమి నేతృత్వంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్