Sunday, September 8, 2024

ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు.

- Advertisement -

ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు.
పరిషత్ లో ప్రత్యేక పాలన తప్పదా?

జులై 4 లో మూగియూన జెడ్పిటిసి,ఎంపీటీసీ ల పదవి కాలం .
..
గోదావరిఖని

సర్పంచుల పదవి కాలం ఇప్పటికే ముగించింది. వారి పాలన కాలాన్ని పొడిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది.జులై 4న మండల పరిషత్. జెడ్పి చైర్మన్. పదవీకాలం ముగియనుంది. మరి వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారుల కే బాధ్యతలు అప్పగిస్తారా అనే పై అంతట చర్చ సాగుతుండగా —తమ పాలన కాలాన్ని పొడిగించాలని ఎంపీటీసీ. జెడ్పిటిసి సభ్యుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది.
గ్రామపంచాయతీల మాదిరిగా జిల్లా. మండల. పరిషత్తులు కూడా త్వరలోనే ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. జులై 4 5 తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు సమయం పట్టే అవకాశముంది. దీంతో గ్రామపంచాయతీల మాదిరిగానే మండల. జిల్లా పరిషత్ లో, మండల.పరిషత్.  లోను ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన రాసినప్పటికీ. ప్రత్యేకం అనేవార్యం కానుందని ఆదేశంలో ఆదేశంతో అధికారులు అదే దశగా కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పిటిసి . పాలకవర్గాల గడువు జులై 4 తో ముగియనుంది. 2019లో అప్పటి పాలకవర్గాల గడువు ఐదేళ్లు ముగింపు ముందే రెండు నెలల ముందే అంటే మే 15 ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. కానీ–ఈసారి గడువు సమీపిస్తున్న–ఇప్పటివరకు కసరత్తు ప్రారంభం కాలేదు.

ఆలస్యం కానున్న ఎన్నికలు—

జెడ్పిటిసి. ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్లు. ఓటర్ల. ముసాయదా జాబితా. పోలింగ్ బూతుల ఎంపిక. అధికారులకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ—ఇప్పటివరకు ప్రక్రియ ప్రారంభ కాలేదు. ఒకవేళ ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా–పనులన్నీ చక్కా పెట్టాలంటే కనీసం మూడు నెలలు పట్టి అవకాశం ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రిజర్వేషను ఎలాగో…

ఇప్పటికప్పుడు ప్రభుత్వం జడ్పిటిసి ఎంపిటిసి నిర్వహించాలని ఆదేశించిన క్షేత్రస్థాయిలో వీలుపడకపోవచు.2019 ఎన్నికలలో పెద్దపెల్లి జిల్లాలో. ఎంపీటీసీను137.ఉన్నారు. వీరి పదవి కాలం జులై 5వ తేదీన పూర్తి కానున్నది.

అధికారుల కసరత్తు..

ప్రత్యేక అధికారుల పాలన అనేవార్యం కానుండడంతో. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానప్పటికీ. జిల్లా యంత్రాంగం ఆదర్శగా ముందుగానే కసరత్తు ప్రారంభించింది. జిల్లా పరిషత్తులకు ఆయే జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇంకా మండల పరిషత్ కు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఇప్పటికే అన్ని మండలాలకు ఏదో ఒక శాఖ జిల్లా స్థాయి అధికారి మండల ప్రత్యేక అధికారిగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలను. పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారిని మండల పరిషత్తులకు ప్రత్యేక అధికారికంగా నియమిస్తారా? లేక మరో జిల్లా స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తారా? అనేది త్వరలోనే తేలనుంది.
పట్టు కోసం హస్తం పార్టీ…
పెద్దపెల్లి జిల్లాలో జెడ్పిటిసిలు 13.మండల ఎంపీటీసీలు 137 ఉన్నారు. వీరి పదవి కాలం మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.తమ పదవులను కొనసాగిస్తారా అనే అంశం కొందరిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికల వరస క్రమంలో రానున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పథకాలు అమలు సర్కార్ అభిరుచి అడుగులు వేస్తుంది. కానీ కాంగ్రెస్ నేతలు. ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ.

ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధమైనప్పటికీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం ఉండదు. రిజర్వేషన్లు ముసాయధా. ఓటర్ల జాబితా తయారీ. పోలింగ్ కేంద్రాల గుర్తింపు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. కనీసం ఇప్పట్లో ఎన్నికలు లేనట్లుగానే కనిపిస్తుంది. ఎన్నికల మాట లటుంచితే పాటికీ. తహతహలాడుతున్న. అభ్యర్థులను రిజర్వేషన్లు అంశం ఆందోళనకు గురిచేస్తుంది.
పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం. సర్పంచులు. ఎంపీటీసీలు. జెడ్పిటిసిలకు. పదేళ్లపాటు ఒకే రిజర్వేషన్ కొనసాగేలా చట్టం చేసింది. దాని ప్రకారంగా 2 0 1 9 లో ఎన్నికలు నిర్వహించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సర్కారు ప్రకటించిన రిజర్వేషన్లను ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక చట్టసవన్నతో కొత్త రిజర్వేషన్లను ప్రకటిస్తుందా? అనే దానిపై అభ్యర్థులో త్రీవ ఉత్కంఠ నెలకొంది. బీసీ కులం గణానకు ప్రభుత్వం. ముగ్గు చూపు తుండటం. బీసీ రిజర్వేషన్ల సవరణ అనివార్యమని భావన కూడా రాజకీయ పార్టీలో వ్యక్తం మవుతొతుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తే తప్ప దీనిపై సృష్టిత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్