నెల రోజులుగా జైలు లోఎనే లగచర్ల రైతులు
Lagacharla farmers have been in jail for a month
హైదరాబాద్
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ,డాక్టర్ కె .సంజయ్ లు అసెంబ్లీ మీడియాతో పాయింట్ దగ్గర మాట్లాడారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఏసీ లో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణం. టూరిజం మీద కాదు ఇపుడు చర్చించాల్సింది ..లగచర్ల లో రైతులను అక్రమం గా అరెస్టు చేయడం పై చర్చించాలి.
లగచర్ల రైతులు చేసిన తప్పేమిటి ? నెల రోజులుగా జైల్లో వేసేంత తప్పు రైతులు ఏం చేశారు. గుండె పోటు వచ్చిన హీరా నాయక్ కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకు వస్తారా ? యావత్ తెలంగాణ రైతులను
అనుమానించారని అన్నారు.
టూరిజం మీద చర్చ కాదు లగచర్ల లో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలి. అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసం రేవంత్ భూ సేకరణ చేస్తున్నారు. లగచర్ల పై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో
చర్చ జరగాల్సిందే. సీఎం ఢిల్లీ టూరిజం ,జైలు టూరిజం తప్ప రాష్ట్రం లో ఏమీ లేదు. వెంటనే ఎన్నికలు రావాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తే రేవంత్ పీడ వదలిపోతుందని రైతులు అనుకుంటున్నారు. 75
లక్షల మంది రైతులు రేవంత్ పై ఆగ్రహం తో ఉన్నారని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడుతూ అప్పులపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్బీఐ i హ్యాండ్ బుక్ లో పేర్కొన్న దాని ప్రకారం మన అప్పు 3 లక్షల 17 వేల కోట్లే. అప్పు ఏడు లక్షల కోట్ల
రూపాయలంటూ అసెంబ్లీ ని తప్పుదోవ పట్టించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని అన్నారు.