పిడుగురాళ్లలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

- Advertisement -

పిడుగురాళ్లలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Lawyers expelled from court duties in thunderbolts

పిడుగురాళ్ల,
పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు విధులను పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బహిష్కరించారు.
అనంతపురం జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది బీవీ శేషాద్రి పట్ల అనంతపురం మూడవ పట్టణ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన మృతి చెందారు అని తెలియవచ్చింది అని పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే కుమారస్వామి అన్నారు.   అందుకు నిరసనగా పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కమదన కుమారస్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు రామిరెడ్డి, కంభంపాటి కోటేశ్వరరావు, కావూరి జాలరావు, కోపూరి వెంకటేశ్వర్లు, ఆతుకూరి సీతారామయ్య, లోకేశ్వరి, వెలిశల రామకృష్ణ, ప్రశాంత్ నాయక్, బెల్లంకొండ అచ్చారావు, మదాసు వెంకటేశ్వరరావు, సాగర్, నవ్య,
అయాజ్ అహమద్, ఎస్వీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular