Sunday, September 8, 2024

నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందాం.

- Advertisement -

నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందాం.

NEP కి వ్యతిరేకంగా AISF ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాల సేకరణ.

AISF జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దినేష్ శ్రీరంగరాజ్.

(వాయిస్ టుడే న్యూస్) ఫిబ్రవరి 05 మేడిపల్లి :

అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని AISF జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దినేష్ శ్రీరంగరాజ్ పిలుపునిచ్చారు. NEP కి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా కేంద్రంలోని ఉప్పల్ డిపో వద్ద ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దినేష్, విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించాలని కోరారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయికరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి బదులు హిందుత్వ రాజ్యాన్ని స్థాపించడానికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు.

AISF తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.

నూతన జాతీయ విద్యా విధానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయలను, విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తారని తెలిపారు.
ఇప్పటికే పేద వర్గాలకు అందని ద్రాక్షగా మారిన విద్య, NEP అమలుతో విద్యకు మరింత దూరం చేయబడుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా NEP కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫిస్ బేరర్లు గ్యార క్రాంతి , గ్యార నరేష్ , రెహమాన్ , నెల్లి సత్య ,మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్, ఉపాధ్యక్షుడు హరీష్, జిల్లా నాయకులు గోపి, అరవింద్, శివ, రాము, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్