బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల నారాయణ రెడ్డి
కమాన్ పూర్ : మంథని నియోజకవర్గంలో రామగిరి మండలం సెంటనరీ కాలనీ మరియు కల్వచర్ల మరియు బేగంపేట్ విలెజ్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించి ఓటు వేసి గెలిపించాలని చల్ల నారాయణ రెడ్డి కోరారు.
నారాయణ రెడ్డి మాట్లాడుతూ…
బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజన రాజ్యాన్ని సాధించుకుందాం.
ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాలను అభివృద్ధి చేసి ప్రతీ ఒక్క పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారు. కానీ విద్యార్థులకు ఉపాధి కల్పించలేక పోయానని, ప్రవీణ్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలు వస్తే ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థులకు ఉద్యోగ కల్పనా కోసం బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలి ప్రవీణ్ కుమార్ సీఎం కావాలి అన్నారు.
వారి మార్గదర్శకంలో, వారి అడుగులో అడుగులు వేస్తూ, అభివృద్ధి దిశగా మంథని నియోజకవర్గంలో బహుజన జెండా ఎగరవేస్తామని అన్నారు.
ఇన్ని ఏండ్లు ఓటు వేశారు కానీ ఏ ఒక్క నాయకుడు మిమ్మల్ని దగ్గరకు తీయలేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అని ఆరోపించారు.
నన్ను ఒక్కసారి గెలిపించండి.మీ ఇంట్లో బిడ్డగా లెక్క, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



