- Advertisement -
వైభవంగా కనకదుర్గమ్మ ఊరేగింపు
Magnificent Kanakadurgamma processionపెంటపాడు ,అక్టోబర్ 3,
పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో వెలసిన పురాతన రాతి విగ్రహం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్యాండ్ మేళం, బుట్ట బొమ్మలు, గరగ నృత్యాలు, ప్రత్యేక వేషధారణలో అమ్మవారి ఊరేగింపు సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని యువత జనసైనికులు ఊరేగింపు లో సందడి చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బడేటి భాను పర్యవేక్షణలో ఊరేగింపు సాగింది.
- Advertisement -




